Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలికలకు చాక్లెట్లు ఇచ్చి అశ్లీల చిత్రాలు చూపించే ప్రబుద్ధుడు.. ఎక్కడ?

బాలికలకు చాక్లెట్లు ఇచ్చి అశ్లీల చిత్రాలు చూపించే ప్రబుద్ధుడు.. ఎక్కడ?
, సోమవారం, 8 మార్చి 2021 (17:48 IST)
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సమాజం సిగ్గుతో తలవంచుకునే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో జరిగింది. ఓ 68 యేళ్ళ కామాంధుడు... బాలికలకు చాక్లెట్లు ఇచ్చి వారికి అశ్లీల వీడియోలు చూపిస్తూ వచ్చాడు. ఈ విషయాన్ని ఓ చిన్నారి తన తల్లి దృష్టికి తీసుకెళ్లడంతో ఆ ప్రబుద్ధుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 12 యేళ్ళ బాలిక తల్లి వృద్ధుల సంరక్షకురాలిగా పనిచేస్తున్నారు. చెన్నై, ఎన్నూరుకు చెందిన పుష్పరాజ్‌ (68) అనే వ్యక్తి బాలికకు గేమ్స్‌ ఆడుకోమని తన సెల్‌ఫోన్‌ ఇచ్చేవాడు. పనిలోపనిగా చాక్లెట్లు ఇచ్చి అశ్లీల చిత్రాలు చూసేలా ప్రేరేపించేవాడు. 
 
ఈ క్రమంలో అశ్లీల వీడియోలను చూసేలా బాధితురాలిని ప్రేరేపించి ఆపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. బాలిక ఈ విషయం తల్లికి చెప్పడంతో ఆమె నిందితుడు పుష్పరాజ్‌ను నిలదీశారు. నిందితుడు తన మొబైల్‌ ఫోన్‌లో అశ్లీల వీడియోలను స్టోర్‌ చేసినట్టు ఆమె గుర్తించారు. 
 
పుష్పరాజ్‌ నిర్వాకంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు మరో  ముగ్గురు బాలికలపైనా ఇలాగే వేధింపులకు పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసి జ్యుడిషియల్‌ కస్టడీకి తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మ్యూజిక్ టీచింగ్ టెక్నాలజీ - ‘లెర్న్ బడ్డీ’తో ఫుర్టాడోస్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ పాఠశాలల్లో సంగీత విద్య