Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 31 March 2025
webdunia

మరికొన్ని నిమిషాల్లో నిర్దేశిత ప్రాంతానికి విక్రమ్ ల్యాండర్

Advertiesment
vikram lanunder
, బుధవారం, 23 ఆగస్టు 2023 (15:19 IST)
చంద్రయాన్-3 ప్రయోగం చివరి దశకు చేరుకుంది. సుధీర్ఘంగా ప్రయాణం చేసిన విక్రమ్ ల్యాండర్ మరికొన్ని గంటల్లో చంద్రుడి దక్షిణ ధృవాన్ని ముద్దాడనుంది. ఇందుకోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ముఖ్యంగా, ఆటోమేటిక్‌ ల్యాండింగ్ సీక్వెన్స్‌ను ప్రారంభించేందుకు అంతా సిద్ధంగా ఉందని, ల్యాండర్ విక్రమ్ నిర్దేశిత ప్రాంతానికి 5.44 గంటలకు చేరుకుంటుందని ఇస్రో ట్వీట్  చేసింది. 
 
అదేసమయానికి ఆటోమేటిక్‌ ల్యాండిగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపింది. సాయంత్రం 5.20 సమయానికి ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని వెల్లడించింది. అంతా అనుకున్నట్టుగా సాఫీగా సాగితే చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధృవంపై కాలు మోపుతుందని వెల్లడించింది. కాగా, ఈ ప్రయోగ ప్రక్రియలో చివరి 17 నిమిషాలు చాలా కీలకమని పేర్కొంది. చంద్రయాన్-3 ప్రత్యక్ష ప్రసారాన్ని ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు. అలాగే, ఇస్రో యూట్యూబ్, ఫేస్‌బుక్ పేజీలలో కూడా చూడొచ్చని తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యపై అనుమానంతో కన్నకుమార్తెను బండరాయితో మోది చంపేసిన తండ్రి..