Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కావేరీ బోర్డును ఏర్పాటు చేయలేం... సుప్రీం ఆదేశాలపై చేతులెత్తేసిన మోడీ సర్కారు

కావేరీ బోర్డు ఏర్పాటుపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించలేమంటూ కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈనెల నాలుగో తేదీలోపు కావేరీ బోర్డును ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిన విషయం తెల్సింద

కావేరీ బోర్డును ఏర్పాటు చేయలేం... సుప్రీం ఆదేశాలపై చేతులెత్తేసిన మోడీ సర్కారు
, సోమవారం, 3 అక్టోబరు 2016 (12:26 IST)
కావేరీ బోర్డు ఏర్పాటుపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించలేమంటూ కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈనెల నాలుగో తేదీలోపు కావేరీ బోర్డును ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిన విషయం తెల్సిందే. ఈ ఆదేశాలు ఆచరణలో సాధ్యం కాదని మోడీ సర్కారు స్పష్టం చేసింది. 
 
కావేరీ జల వివాదంపై మరోమారు విచారణ జరిగింది. దిగువకు నీటిని విడుదల చేయని కర్ణాటక ప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తాము ఆదేశిస్తున్నా, కర్ణాటక పట్టించుకోవడం లేదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆక్షేపించింది. ఆపై తక్షణం ఇరు రాష్ట్రాల అధికారులు, జల నిపుణులతో కావేరీ రివర్ బోర్డును ఏర్పాటు చేసి, నీటి నిల్వ, పంపిణీపై చర్చించాలని ధర్మాసనం ఆదేశింది. 
 
ఇది ఇప్పట్లో సాధ్యం కాదని కేంద్రం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులను సవరించాలని ప్రభుత్వం తరపున పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మరోమారు విచారణ జరుగుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాకు సహనం కత్తులు ఉన్నాయ్, మోడీకి ధైర్యం ఉంటే పాక్ ఆర్మీతో తలపడాలి : బెలూన్లతో బెదిరింపులు