మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రెండో పెళ్లి చేసుకున్న మహిళకు కుల పెద్దలు దారుణ శిక్ష విధించారు. కుల పెద్దల ఉమ్మిని నాకాలని ఆదేశించారు. వివరాల్లోకి వెళితే.. అకోలా జిల్లాకు చెందిన ఓ మహిళ(35)కు 2011లో వివాహమైంది. 
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	కుటుంబ గొడవల కారణంగా తన భర్తకు 2015లో విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత 2019లో ఆమె రెండో వివాహం చేసుకుంది. కానీ ఈ వివాహాన్ని ఆమె కులమైన నాథ్ జోగి కమ్యూనిటీ పెద్దలకు నచ్చలేదు.
 
									
										
								
																	
	 
	దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 9న ఆమె సోదరితో పాటు బంధువులను కుల పెద్దలు పిలిపించారు. రెండో పెళ్లి చేసుకున్నందుకు శిక్ష విధిస్తున్నట్లు తెలిపారు. అదేంటంటే.. కుల పెద్దలంతా కలిసి అరటి ఆకులపై ఉమ్మి వేస్తారని, దాన్ని సదరు మహిళ నాకాలని ఆదేశించారు. 
 
									
											
							                     
							
							
			        							
								
																	
	 
	అంతే కాకుండా రూ. లక్ష జరిమానా వేశారు. ఈ శిక్షపై తీవ్ర మనస్తాపానికి గురైన బాధిత మహిళ.. నిన్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.