Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రాణం తీసిన టిక్కెట్ లేని ప్రయాణం... బస్సులోనే ఉరేసుకున్న కండక్టర్‌

ఓ టిక్కెట్ బస్సు కండక్టర్ ప్రాణం తీసింది. ఓ ప్రయాణికుడు టిక్కెట్ లేకుండా ప్రయాణించడం.. తనిఖీ అధికారులు ఆ ప్రయాణికుడిని పట్టుకుని... ఫైన్ వేయడంతో పాటు కండక్టర్‌పై కేసు నమోదు చేశారు. దీంతో మనస్తాపం చెంద

Advertiesment
Bus conductor
, గురువారం, 6 అక్టోబరు 2016 (08:48 IST)
ఓ టిక్కెట్ బస్సు కండక్టర్ ప్రాణం తీసింది. ఓ ప్రయాణికుడు టిక్కెట్ లేకుండా ప్రయాణించడం.. తనిఖీ అధికారులు ఆ ప్రయాణికుడిని పట్టుకుని... ఫైన్ వేయడంతో పాటు కండక్టర్‌పై కేసు నమోదు చేశారు. దీంతో మనస్తాపం చెందిన ఆ కండక్టర్ తాను విధులు నిర్వహించే బస్సులోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
ఈ విషాద ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. ఈ రాష్ట్రానికి చెందిన కేఎస్‌ఆర్టీసీ బస్సులో బీదర్‌ జిల్లా చుంచోళిలో జరిగింది. బీదర్‌-చుంచోళి మార్గంలో సర్వీసు చేస్తున్న కేఎ‌స్‌ఆర్టీసీకి డ్రైవర్‌ కం కండక్టర్‌గా ఈరణ్ణ మీనకేర(35) విధులు నిర్వహిస్తున్నారు. 
 
మంగళవారం రాత్రి 9.30 గంటలకు ఇనస్పెక్షన్ సిబ్బంది బస్సులో తనిఖీలు జరిపారు. బస్సులోని ప్రయాణికుల్లో ఇద్దరికి టికెట్లు లేకపోవడాన్ని వారు గుర్తించారు. దీనిపై కండక్టర్‌ను ప్రశ్నించగా, ఆయన మనస్తాపం చెంది అత్మహత్యకు పాల్పడ్డాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో ఎర... 30 మందిపై క్రైస్తవ ఫాదర్ అత్యాచారం