Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో ఎర... 30 మందిపై క్రైస్తవ ఫాదర్ అత్యాచారం

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి 30 మంది యువతులపై అత్యాచారానికి పాల్పడ్డాడో ఓ క్రైస్తవ మతబోధకుడు. అంతేకాదు.. అతని వల్ల గర్భం దాల్చిన ఓ యువతి తనను పెళ్లాడాలని పట్టుబట్టడంతో ఆమెను దారుణం

Advertiesment
TamilNadu
, గురువారం, 6 అక్టోబరు 2016 (08:44 IST)
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి 30 మంది యువతులపై అత్యాచారానికి పాల్పడ్డాడో ఓ క్రైస్తవ మతబోధకుడు. అంతేకాదు.. అతని వల్ల గర్భం దాల్చిన ఓ యువతి తనను పెళ్లాడాలని పట్టుబట్టడంతో ఆమెను దారుణంగా హత్య చేశాడు. తాజాగా ఆ కామాంధుడి మాటలకు మోసపోయిన మరో యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని పాపాల చిట్టా వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తిరునెల్వేలి జిల్లాకు చెందిన మిలన్ సింగ్‌ (46) రామనాథపురం సాయల్‌కుడి గ్రామంలో ఓ చర్చిలో ఫాదర్‌గా సేవలు అందిస్తున్నాడు. ఈయన ఆరు నెలల క్రితం పాళయంకోటకు చెందిన కాంతిమతి(30) అనే యువతికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి.. ఆమె నుంచి రూ.5 లక్షలు, నగలు తీసుకున్నాడు. ఇటీవల ఆమెను తీసుకెళ్లి కదులుతున్న కారులో కిందికి తోసేసి... నగదుతో పారిపోయాడు. ఆమె ఫిర్యాదు ఇవ్వడంతో శంకరన్ కోయిల్‌ పోలీసులు మిలన్ సింగ్‌ను అరెస్టు చేశారు. 
 
అతని వద్ద జరిపిన విచారణలో ఇప్పటివరకు 30 మందివరకు మాయమాటలు చెప్పి అ త్యాచారానికి పాల్పడినట్టు వెల్లడించాడు. వీరిలో అన్బుసెల్వం (24) అనే యువతి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో సజీవదహనం చేశాడు. ఈ కామాంధ ఫాదర్‌కు అతని భార్య కూడా పూర్తిగా సహకరించడం గమనార్హం. ప్రస్తుతం ఆమె కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పారాగ్లైడర్ల సాయంతో భారత్‌లోకి పాక్ మిలిటెంట్లు చొరబాట్లు: ఐబీ వార్నింగ్