Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్డీయేకు సవాల్.. యూపీలో 11 స్థానాల్లో పోటీకి రెడీ.. అఖిలేష్

Advertiesment
akhilesh yadav

సెల్వి

, శనివారం, 27 జనవరి 2024 (14:00 IST)
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఎకు సవాలు విసిరే లక్ష్యంతో ఉన్న "ఇండియా" కూటమికి కాంగ్రెస్‌తో పొత్తు శుభారంభమని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ శనివారం ప్రశంసించారు. 
 
తొలి రౌండ్ సీట్ల పంపకాల చర్చల్లో కూటమి 11 బలమైన స్థానాలను కైవసం చేసుకున్నట్లు యాదవ్ ట్వీట్ చేశారు. గెలుపు సమీకరణంతో ఈ ట్రెండ్ కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో పొత్తు కోసం ఎస్పీ, కాంగ్రెస్‌లు చర్చలు జరుపుతున్నాయి. ఎస్పీ ఇప్పటికే రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డి)తో సీట్ల పంపకాల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కాంగ్రెస్‌తో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి.
 
 
 
2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో 71 సీట్లు గెలుచుకున్న బీజేపీకి ఈ కూటమి పెను ముప్పుగా పరిగణిస్తోంది. ఎస్పీకి ఐదు, కాంగ్రెస్‌కు రెండు, ఆర్‌ఎల్‌డీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో ఇసుక దందా.. కిలో చొప్పున విక్రయం