Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సునీతా సింగ్ గోర్ సంచలన వ్యాఖ్యలు.. ముస్లిం మహిళల ఇంట్లోకి దూరి..?

Advertiesment
BJP
, సోమవారం, 1 జులై 2019 (11:39 IST)
బీజేపీ నేతలకు నోటి దురుసు అంతా ఇంతా కాదు. తాజాగా యూపీ బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీతా సింగ్ గౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


ముస్లింలకు బుద్ధి చెప్పాలంటే.. మన భారతదేశాన్ని కాపాడుకోవాలంటే.. హిందూ సోదరులు పది నుంచి 20 మంది గ్రూపుగా ఏర్పడి ప్రతి ముస్లిం ఇంట్లో దూరి మహిళలను రేప్ చేయాల్సిందేనని పిలుపు నిచ్చారు. 
 
అప్పుడే ముస్లింలకు బుద్ధి వస్తుందన్నారు. ముస్లింల తల్లులు, చెల్లెళ్లు, అక్కలను గ్యాంగ్ రేప్ చేయండని.. ఇంకా వారి శరీర భాగాలను, జననాంగాలను ఛిద్రం చేసి వీధుల చౌరస్తాలో మృతదేహాలను వేలాడదీయండంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 
 
ఫేస్‌బుక్‌‌లో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఇంకా ఆమెను బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపోతే.. ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పోస్టును సునీతా సింగ్ ఫేస్‌బుక్ పేజీ నుంచి తొలగించినప్పటికీ అప్పటికే స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టెక్కీ భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన యువతి