Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గజదొంగ చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం : జోస్యం చెప్పిన బీజేపీ నేత

గజదొంగ చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం : జోస్యం చెప్పిన బీజేపీ నేత
, శనివారం, 29 జూన్ 2019 (11:45 IST)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో రెండేళ్ళ తర్వాత జైలుకెళ్లడం ఖాయమని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్ సునీల్ దేవరా జోస్యం చెప్పారు. కర్నూలు జిల్లాలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, గజదొంగగా మారిన చంద్రబాబు గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోచుకున్నారన్నారు. అందవల్ల వచ్చే రెండేళ్ళలో చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయమన్నారు. 
 
పైగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ దొంగల పార్టీగా, టీడీపీ కాస్త తెలుగు డ్రామా పార్టీగా  మారిపోయిందన్నారు. ఈ దొంగల పార్టీకి ముఠా నాయకుడు చంద్రబాబేనని, జూనియర్ నేత ఆయన తనయుడు అని చెప్పారు. గత ఐదేళ్ళ టీడీపీ హయాంలో గ్రామగ్రామంలో అవినీతి చోటుచేసుకుందని ఆయన అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పప్పుబాబుకు ఉన్న చిటికెడు మెదడు చిట్లిపోయినట్టుంది : విజయసాయి రెడ్డి