Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అత్యాచారం చేసి.. కొడుకుతో కట్టేసి వివాహితను నదిలోకి విసిరేసిన దుండగులు

అత్యాచారం చేసి.. కొడుకుతో కట్టేసి వివాహితను నదిలోకి విసిరేసిన దుండగులు
, సోమవారం, 12 అక్టోబరు 2020 (13:47 IST)
బీహార్ రాష్ట్రంలో జరిగిన దారుణం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. కొందరు దుండగులు ఓ వివాహితపై అత్యాచారానికి తెగబడ్డారు. ఆ తర్వాత ఆమె ఐదేళ్ళ కుమారుడుతో పాటు కట్టేసి ఆమెను నదిలో విసిరిపారేశారు. బాధితురాలు అరుపులతో అప్రమత్తమైన స్థానికులు, ఆమెను ఎలాగోలా రక్షించినా బాబు ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయారు. ఈ దారుణం బక్సర్ జిల్లాలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బక్సర్‌కు చెందిన ఓ వివాహితి ... తన ఐదేళ్ల కుమారుడుతో కలిసి బ్యాంకుకు వెళుతుండగా కొందరు దండగులు వారిద్దరినీ కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత వారిని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. 
 
అయితే, ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. ఆ తర్వాత నేరం నుంచి తప్పించుకునేందుకు ఇద్దరినీ కట్టేసి నదిలో తోసేశారు. బాబు మృతదేహం లభ్యమైంది. నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం వేట కొనసాగిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విస్తారంగా వర్షాలు... ఎనిమిదోసారి తెరుచుకోనున్న శ్రీశైలం గేట్లు