Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ ఇద్దరు విద్యార్థుల ఖాతాలో రూ.960 కోట్లు.. ఎగిరిగంతేశారు.. అంతే..?

Advertiesment
Bihar
, గురువారం, 16 సెప్టెంబరు 2021 (19:17 IST)
బీహార్‌లో ఓ అరుదైన ఘటన తెర మీదకు వచ్చింది. ఇద్దరు విద్యార్థుల బ్యాంక్‌ అకౌంట్‌లో.. ఏకంగా రూ. 960 కోట్ల రూపాయలు జమయ్యాయి. అంతే ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులు షాకయ్యారు. అంతే కాదు.. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు.. ఒక్కసారిగా ఎగిరిగంతేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. కటిహార్‌ జిల్లాలోని బౌరా పంచాయితీ పరిధిలోని పస్తియా గ్రామానికి చెందిన ఆశిష్‌, విశ్వాస్‌ అనే ఇద్దరు విద్యార్థులకు బిహార్‌ గ్రామీణ్‌ బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి. వీరి పాఠశాల యూనిఫామ్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నగదు తమ ఖాతాలో జమ అయ్యిందో లేదో అని తెలుసుకునేందుకు తమ తల్లిదండ్రులతో కలిసి ఊరిలోని ఇంటర్నెట్‌ వద్దకు వెళ్లారు. వీరి అకౌంట్‌ నెంబర్‌ను సంబంధిత బ్యాంక్‌ వెబ్‌సైట్‌లో టైప్‌ చేసి చూసి, ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.
 
ఆరో తరగతి చదివే ఆశిత్ కుమార్ ఖాతాలో రూ.900 కోట్లు.. గురు చరణ్‌ విశ్వాస్​ ఖాతాలో రూ.60 కోట్ల రూపాయలు జమయ్యాయి. ఈ సంఘటనపై బ్యాంక్‌ అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. 
 
డబ్బుల విషయం తెలిసి బ్యాంక్‌ మేనేజర్​ మనోజ్​ గుప్తా షాకయ్యారు గురయ్యారు. ఇద్దరు అబ్బాయిల బ్యాంక్ అకౌంట్లలో భారీ మొత్తాన్ని గుర్తించినట్లు తమకు సమాచారం అందిందని దానిని తాము పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అయితే టెక్నికల్‌ ఇష్యూ వల్లే ఇదంత జరిగిందని మనోజ్‌ గుప్పా చెప్పుకొచ్చాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాయిధరమ్‌ను పరామర్శించిన స్టైలిష్ స్టార్ బన్నీ