Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అందుకే రక్షితను రేప్ చేసి చంపాను... నిందితుడు ఇతడే...

బెంగుళూరు అత్యాచార నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలంటున్న మహిళలు డిమాండ్ చేస్తున్నారు. కర్నాటక రాష్ట్రం కోలారు జిల్లా పదో తరగతి చదువుతున్న రక్షితపై అత్యాచారం చేసిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. న

అందుకే రక్షితను రేప్ చేసి చంపాను... నిందితుడు ఇతడే...
, శనివారం, 4 ఆగస్టు 2018 (13:29 IST)
బెంగుళూరు అత్యాచార నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలంటున్న మహిళలు డిమాండ్ చేస్తున్నారు. కర్నాటక రాష్ట్రం కోలారు జిల్లా పదో తరగతి చదువుతున్న రక్షితపై అత్యాచారం చేసిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, అఖిలపక్ష నాయకులు విద్యార్థులు నడిరోడ్డు మీద ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. 
 
ప్రేమిస్తున్నానని నిందితుడు వెంటపడటంతో రక్షిత అతడిని నడిరోడ్డుపై కొట్టింది. దీంతో అతడు ఆమెపై కక్ష పెంచుకుని మరో ఇద్దరు స్నేహితులతో కలిసి రక్షితను అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. ఈ విషయాన్ని స్వయంగా నిందితుడు పోలీసులు ఎదుట ఒప్పుకున్నాడు. 
 
కాగా కర్ణాటక కొలార్ జిల్లా మాలూరులో రక్షిత అనే పదవ తరగతి బాలికపై గత 2వ తేదీన బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆమెను అత్యంత దారుణంగా పదునైన ఆయుధంతో హత్య చేశారు. బెంగళూరులోని మలూర్ స్టేడియంలో జరుగుతున్న క్రీడల్లో పాల్గొనేందుకు బాలిక వెళ్లింది. త్రో బాల్ క్రీడలో పాల్గొన్న ఆమె కార్యక్రమం ముగిశాక 5.30 నిమిషాల సమయంలో ఇంటికి తిరిగి వస్తోంది. ఆ సమయంలో ప్రేమిస్తున్నానంటూ వెంటబడుతున్న సదరు వ్యక్తి ఆమెను అటకాయించి తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత దారుణంగా హత్య చేసి పరారయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియుడితో భార్య రొమాన్స్... చూశాడనీ భర్త అంగాన్ని కొరికిన భార్య...