Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పబ్‌కు తీసుకెళ్లి బాగా తాగించారు.. ఆపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు..

ఐటీ సిటీగా పేరున్న బెంగళూరు ప్రస్తుతం కీచకపర్వాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోతోంది. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా యువతులపై పోకిరీ ఆగడాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు పెచ్చరిల్లిపోతున

పబ్‌కు తీసుకెళ్లి బాగా తాగించారు.. ఆపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు..
, సోమవారం, 30 జనవరి 2017 (16:49 IST)
ఐటీ సిటీగా పేరున్న బెంగళూరు ప్రస్తుతం కీచకపర్వాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోతోంది. కొత్త  సంవత్సర వేడుకల సందర్భంగా యువతులపై పోకిరీ ఆగడాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు పెచ్చరిల్లిపోతున్నాయి. కొత్త ఏడాది ఆరంభాన గార్డెన్ సిటీలో జరిగిన సామూహిక లైంగిక వేధింపులు యావత్ భారతాన్ని కలవరపరిచిన సంగతి తెలిసిందే.
 
తాజాగా మరో దారుణం బెంగళూరులో చోటుచేసుకుంది. పరిచయమున్న ఓయువతిని పబ్‌కు పిలిచి బాగా తాగించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు ఇద్దరు యువకులు. వివరాల్లోకి వెళితే.. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ యువతి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తోంది. రికీ, యెమెన్‌కు చెందిన ఆయూబ్ అనే ఇద్దరు యువకులు ఆ అమ్మాయిపై లైంగిక వేధింపులకు దిగి ఇంటికి తీసుకెళ్తామని చెప్పి రోడ్డుపైనే వదిలివెళ్లిపోయారు. 
 
రోడ్డుపై స్పృహతప్పి పడివున్న ఆ యువతిని ఓ నర్స్ ఇంటికి తీసుకెళ్లి ఆశ్రయమిచ్చింది. రెండు రోజుల తర్వాత ఆ యువతి తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జియోకు ఎయిర్‌టెల్ చెక్ పెట్టేందుకు... ఏకం కానున్న ఐడియా-వొడాఫోన్