Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యూపీలో యువతిని అమ్మేశారు.. పెళ్లయ్యాక లాక్కెళ్లిపోయారు..?

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై కామాంధులు ఓ వైపు రెచ్చిపోతుంటే.. మరోవైపు యువతులను బజారులో వస్తువులా అమ్మేస్తున్నారు. తాజాగా యూపీలో ఓ దారుణం చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జ

యూపీలో యువతిని అమ్మేశారు.. పెళ్లయ్యాక లాక్కెళ్లిపోయారు..?
, శనివారం, 24 మార్చి 2018 (15:41 IST)
ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై కామాంధులు ఓ వైపు రెచ్చిపోతుంటే.. మరోవైపు యువతులను బజారులో వస్తువులా అమ్మేస్తున్నారు. తాజాగా యూపీలో ఓ దారుణం చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే? యూపీలో ఓ యువతిని దారుణంగా అమ్మకానికి పెట్టారు. 
 
వివరాల్లోకి వెళితే.. పశ్చిమ యూపీలోని బాగ్‌పత్ జిల్లా, సురోర్‌పూర్ కలాన్ గ్రామంలో ఓ యువతిని కొందరు ఏజెంట్లు అమ్మేశారు. ఈ నెల 16న  ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటుక బట్టీలో కూలీగా పనిచేసే ముకేష్ అనే వ్యక్తికి సదరు యువతిని రూ.22 వేలకు ఇద్దరు బ్రోకర్లు వేలంపాటలో విక్రయించారు. అడ్వాన్సు కింద ముకేష్ వారికి రూ.17,500 చెల్లించి తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 
 
కానీ మిగిలిన మొత్తాన్ని అతను చెల్లించకపోవడంతో.. యువతిని బ్రోకర్లు లాక్కెళ్లిపోయారు. ఇలా పెళ్లి చేసుకున్న యువతి ఆచూకీ తెలియరాకపోవడంతో మనస్తాపానికి గురైన ముకేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముకేశ్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులకు విచారణలో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. 
 
ముకేష్ కేసును విచారిస్తుండగా యువతి వేలంపాట విక్రయ ఘటన తమ దృష్టికి వచ్చిందని బాగపత్ సర్కిల్ అధికారి దిలీప్ సింగ్ చెప్పారు. అలాగే ముకేష్ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు చట్టవిరుద్ధంగా వధువుల అక్రమ రవాణా, విక్రయం కిందం ఇద్దరు ఏజెంట్లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందుకు పనికిరాడని భర్తను చంపి.. వేరొకడితో....