Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంటి ఓనర్ కుమారుడితో ఆంటీ రాసలీలలు..

ఇంటి ఓనర్ కుమారుడితో ఆంటీ రాసలీలలు..
, సోమవారం, 7 డిశెంబరు 2020 (15:28 IST)
మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ వివాహిత తాను నివాసం ఉండే ఓనర్ కుమారుడిపై కన్నేసింది. అంతేకాదు అతడితో తన శారీరక వాంఛలను తీర్చుకొని, డబ్బులు గుంజడానికి బ్లాక్ మెయిల్ కూడా చేసి అడ్డంగా దొరికిపోయింది. వివరాల్లోకి వెళితే.. ముంబైకు చెందిన ఓ మహిళ ఇటీవలే ఓ ఇంట్లో అద్దెకు దిగింది. అదే ఇంటి ఓనర్ కుమారుడు పదో తరగతి చదువుతున్నాడు. 
 
మహిళ భర్త కోల్‌కతాలో జాబ్ చేసేవాడు. కానీ ఆమె కూడా స్థానిక ఏయిర్ వేస్ కంపెనీలో పనిచేసేది. అయితే ఒంటరితనానికి గురైన మహిళ విపరీతమైన ఆలోచనలు కలిగేవి. దీంతో ఆమె మాదక ద్రవ్యాలకు అలవాటు పడింది. అంతేకాదు కుర్రాడికి రోజు చాక్లెట్స్ ఇస్తూ అందులో మాదక ద్రవ్యాలు కలపడంతో అతడు వాటికి బానిస అయ్యాడు.
 
ఆ కుర్రాడు ఇక చాక్లెట్స్ కోసం చెప్పిన పని చేయడం మొదలు పెట్టాడు. దీంతో ఆ కుర్రాడిని తనకు బానిసగా మార్చుకుంది. శారీరక వాంఛలు తీర్చుకునేందుకు వాడుకుంది. కుర్రాడి తల్లిదండ్రులు ఆఫీసులకు వెళ్లగానే మాలిని.. నెమ్మదిగా ఇంటికి చేరి కుర్రాడిని తన బెడ్రూంలోకి తీసుకెళ్లి కామకేళి ఆడేది. ఈ తతంగం దాదాపు 2 నెలల పాటు సాగింది.
 
ఇదిలా ఉంటే కుర్రాడు గత రెండు నెలలుగా మత్తుగానూ, అలాగే నిర్వీర్యంగా కనిపించడంతో పిల్లవాడికి ఏమైందా అని అతడి తల్లిదండ్రులు చాలా కంగారు పడ్డారు. వెంటనే అతడిని మానసిక నిపుణుడి వద్దకు తీసుకెళ్తే, అక్కడ కౌన్సిలింగ్‌లో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. దీంతో ఎయిర్‌వేస్‌లో పనిచేసే మహిళ వల్లే ఇదంతా జరిగిందని.. తెలిసి షాకయ్యారు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సదరు మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
మైనర్ పిల్లవాడికి మాదకద్రవ్యాలు ఇవ్వడంతో పాటు, లైంగిక వేధింపుల చట్టం కింద కేసులు నమోదు చేశారు. పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచ సాయిల్‌ దినోత్సవం 2020 పురస్కరించుకుని జియోలైఫ్‌ ప్రచారం