కొత్త నోట్లతో ఇబ్బందులు.. ఏటీఏంలు పూర్తిస్థాయిలో పనిచేయాలంటే.. 10రోజులు పడుతుందట..
కొత్త నోట్లతో ప్రజానీకం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనానికి చెక్ పెట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నడుంబిగించిన నేపథ్యంలో.. కొత్త నోట్లు చేతికందక.. చిల్లర లేకుండా, అవసరాని
కొత్త నోట్లతో ప్రజానీకం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనానికి చెక్ పెట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నడుంబిగించిన నేపథ్యంలో.. కొత్త నోట్లు చేతికందక.. చిల్లర లేకుండా, అవసరానికి కావాల్సిన డబ్బు చేతుల్లో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
రెండు రోజులు మూతపడిన ఏటీఎంలు శుక్రవారానికి తెరుచుకుంటాయని అందరూ భావించారు, కానీ శుక్రవారం చాలాసేపటి దాకా పలు ఏటీఎంలు మూసే దర్శనమివ్వడంతో ప్రజలు అసంతృప్తికి లోనయ్యారు. మరోవైపు బ్యాంకుల్లో విపరీతమైన రద్దీతో పాటు సిబ్బందితో గొడవలు కూడా తలెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై స్పందించిన ఎస్బీఐ ఛైర్మన్.. పూర్తి స్థాయిలో ఏటీఎం కార్యకలాపాలు అందుబాటులోకి రావాలంటే మరో 10రోజులు ఆగాల్సిందేనని అంటున్నారు. మరికొన్ని బ్యాంకులైతే.. మరో రెండు రోజుల్లో కొత్త నోట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే ఛాన్సుందని అంటున్నారు. ఆ తర్వాతే ఏటీఎంలలో పూర్తి స్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.
పాత రూ.500, రూ.1000 నోట్లను కేంద్రం రద్దు చేయడంతో బ్యాంకుల వద్ద భారీగా జనాలు క్యూ కడుతున్నారు. పెద్ద నోట్లను బ్యాంకుల్లో జమ చేసిన కస్టమర్లు, వాటి స్థానంలో కొత్త నోట్లను తీసుకుంటున్నారు. మరోవైపు రిజర్వ్ బాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసిన నూతన రూ. 500, రూ. 2000 వేల నోట్లు వేగంగా బ్యాంకులకు చేరుకుంటున్నాయి.