అచ్చేదిన్ ఎక్కడా? అని అడిగితే ఇక చెప్పుదెబ్బలే.. మంత్రి కుమారుడి ఫేస్బుక్ పోస్ట్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు చేస్తే సహించే ప్రసక్తే లేదని మధ్యప్రదేశ్కి చెందిన అటవీశాఖ మంత్రి గౌరీశంకర్ షేజ్వార్ కుమారుడు ముదిత్ సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు. అవినీతి నిర్మూలన అంటే అచ
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు చేస్తే సహించే ప్రసక్తే లేదని మధ్యప్రదేశ్కి చెందిన అటవీశాఖ మంత్రి గౌరీశంకర్ షేజ్వార్ కుమారుడు ముదిత్ సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు. దేశంలో నల్లధనం నిర్మూలనకు రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు మోదీ మంగళవారం ప్రకటించిన నేపథ్యంలో.. అవినీతి నిర్మూలన అంటే అచ్చేదిన్ వచ్చేసినట్లేనని ఇంకెవరైనా ఆయన్ని తప్పుబడుతూ అచ్చేదిన్ ఎక్కడా? అనడిగితే చెప్పుతో కొడతానంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. తన ఐడియా నచ్చితే లైక్ చేయాలని లేకపోతే తన పేజీని అన్ లైక్ చేయొచ్చునని కూడా తెలిపారు.
పనిలో పనిగా ఈ పోస్టుపై అనవసరంగా రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని ముదిత్ చెప్పారు. కాగా ముదిత్ పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే లైకులు, కామెంట్లు వెల్లువెత్తాయి. అయితే తన కుమారుడు ఈ పోస్ట్ రాసి ఉండడని మంత్రి గౌరీశంకర్ చెప్పడం చర్చనీయాంశమైంది. అయితే మంత్రి కుమారుడి ఫేస్బుక్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.