Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేరళలో మంకీ ఫీవర్.. 24 ఏళ్ల యువకుడికి పాజిటివ్

కేరళలో మంకీ ఫీవర్.. 24 ఏళ్ల యువకుడికి పాజిటివ్
, గురువారం, 10 ఫిబ్రవరి 2022 (17:32 IST)
గతంలో కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం రేపింది. ప్రస్తుతం కేరళలో మంకీ ఫీవర్ వెలుగులోకి వచ్చింది. కేరళ వయనాడ్​ జిల్లాలోని పనవళ్లీ గిరిజన ప్రాంతంలో 24 ఏళ్ల యువకుడికి ఈ జ్వరం సోకింది. తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరిన ఆ యువకుడికి మంకీ ఫీవర్​ లక్షణాలు ఉండగా.. వైద్య పరీక్షలు చేశారు.
 
అనుకున్నట్లే అతనికి మంకీ ఫీవర్ అని వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం అతనికి మనంతవాడీ వైద్య కళాశాలలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
 
ఈ ఏడాది కేరళలో మంకీ ఫీవర్​ కేసు నమోదవడం ఇదే తొలిసారి. అయితే రెండేళ్ల క్రితం కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సాగర్ మండలం అరళగోడు గ్రామంలో మంకీ ఫీవర్‌తో 26 మంది మృతి చెందారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో కాపులకు రిజర్వేషన్లను తక్షణం అమలు చేయాలి : జీవీఎల్