Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంఘ విద్రోహ శక్తులు ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్‌‍ని తగులబెట్టారు: సీఎం పన్నీర్ సెల్వం

జల్లికట్టు ఉద్యమం హింసాత్మకంగా మారిందని.. ఇందుకు ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్‌ను తగులబెట్టడమే నిదర్శనం. అయితే సంఘ విద్రోహ శక్తులు ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్‌ను తగులబెట్టారని.. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌సల్

Advertiesment
Anti-social elements
, శుక్రవారం, 27 జనవరి 2017 (15:11 IST)
జల్లికట్టు ఉద్యమం హింసాత్మకంగా మారిందని.. ఇందుకు ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్‌ను తగులబెట్టడమే నిదర్శనం. అయితే సంఘ విద్రోహ శక్తులు ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్‌ను తగులబెట్టారని.. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌సల్వం తెలిపారు. చెన్నైవ్యాప్తంగా భారీస్థాయిలో హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డారని తెలిపారు. నిరసనలను ఉపసంహరించుకున్నప్పటికీ సంఘ విద్రోహ శక్తులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేసి హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడినా.. పోలీసులు అత్యధిక స్థాయిలో సంయమనం పాటించారని ఓపీ వెల్లడించారు. 
 
ఇంకా జల్లికట్టు ఉద్యమకారులపై పోలీసుల బల ప్రయోగాన్ని ఓపీ ఈ సందర్భంగా సమర్థించారు. నిరసన కార్యక్రమంలో అసాంఘిక శక్తులు చొరబడ్డాయని, అందువల్లే గత సోమవారం పోలీసులు కనీస స్థాయిలో బల ప్రయోగం చేశారని తెలిపారు. మెరీనా బీచ్‌, తదితర ప్రాంతాల్లో వారంపాటు జరిగిన ఆందోళన కార్యక్రమాలకు హింసాత్మక ముగింపుపై వివరణ ఇవ్వాలని ప్రతిపక్ష డీఎంకే నేత ఎంకే స్టాలిన్ డిమాండ్ చేయడంతో పన్నీర్ సెల్వం పైవిధంగా స్పందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అత్త మీద కోపాన్ని దుత్త మీద కాకుండా.. కన్నకొడుకుపై చూపించింది.. మెట్లపై విసిరేసింది..