Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అత్త మీద కోపాన్ని దుత్త మీద కాకుండా.. కన్నకొడుకుపై చూపించింది.. మెట్లపై విసిరేసింది..

అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు అనే సామెత అందరికీ గుర్తుండే వుంటుంది. అయితే ఈ కోడలు అత్త మీద కోపం కన్న కొడుకుపై చూపించింది. క్షణికావేశం కన్నకొడుకు పాలిట శాపమైంది. ఎంత కోపమైనా వస్తువులను విసిరేస్తే స

అత్త మీద కోపాన్ని దుత్త మీద కాకుండా.. కన్నకొడుకుపై చూపించింది.. మెట్లపై విసిరేసింది..
, శుక్రవారం, 27 జనవరి 2017 (13:51 IST)
అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు అనే సామెత అందరికీ గుర్తుండే వుంటుంది. అయితే ఈ కోడలు అత్త మీద కోపం కన్న కొడుకుపై చూపించింది. క్షణికావేశం కన్నకొడుకు పాలిట శాపమైంది. ఎంత కోపమైనా వస్తువులను విసిరేస్తే సరికానీ బిడ్డను కూడా ఇలా పారేయడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. 
 
వివరాల్లోకి వెళితే.. న్యూఢిల్లీకి చెందిన సోనూ గుప్తా(26) తన అత్తతో గొడవపడింది. అనంతరం బెడ్‌పై ఉన్న బట్టలన్నీ చిందరవందర చేసి అదే బెడ్‌పై నిద్రిస్తున్న తన కుమారుడు అన్షూను కూడా తీసుకుని మెట్లపై నుంచి విసిరేసింది. దీంతో ఆ బాలుడి ముఖం, తలకు గాయాలైనాయి. ఈ బాలుడు ప్రస్తుతం ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. సోనూగుప్తా భర్త నితిన్ గుప్తా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
కాగా... ఆస్తి వ్యవహారాల్లో వచ్చిన తేడాలే ఈ దుశ్చర్యకు కారణమని తెలుస్తోంది. అత్తతో ఏర్పడిన గొడవే ఈ దురాగతానికి దారితీసిందని.. సహనం కోల్పోయిన కోడలు రెండేళ్ల బాలుడిపై ఇలాంటి దారుణానికి ఒడిగట్టిందని పోలీసులు తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంకా గుప్తా షార్ట్ టెంపరని.. ఆమె మెడికల్ రిపోర్టును పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్నానం చేస్తున్న యువతి వీడియో తీసిన యువకుడు... మనస్తాపంతో తల్లీ,చెల్లీ....