Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్లాస్ రూమ్ లోనే బాలిక మృతి.. చలి తీవ్రత కారణంగా గుండెపోటు?

క్లాస్ రూమ్ లోనే బాలిక మృతి.. చలి తీవ్రత కారణంగా గుండెపోటు?
, శుక్రవారం, 20 జనవరి 2023 (13:20 IST)
రాజ్ కోట్ లో తరగతి లోనే బాలిక మృతి చెందింది. చలి తీవ్రత కారణంగా రాజ్ కోట్ లో బాలిక ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. 14 ఏళ్ల రియా సాగర్, రాజ్ కోట్ లోని గొండాల్ రోడ్ లో వున్న ప్రైవేట్ స్కూలులో 8వ తరగతి చదువుతుంది. మంగళవారం ఉదయం ఏడు గంటలకు స్కూలుకు వెళ్లింది. 
 
ప్రేయర్ తర్వాత క్లాస్ రూముకు వెళ్లింది. స్కూల్ సిబ్బంది వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించారు. అయితే విద్యార్థిని అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో స్కూల్ సిబ్బంది బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు. 
 
చలి కారణంగానే తన కుమార్తె మరణించిందని.. రియాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని విద్యార్థిని తల్లి జానకి తెలిపింది. తీవ్రమైన చలి ఉన్నప్పటికీ పిల్లలను ఉదయాన్నే స్కూల్‌కు రప్పిస్తున్నారని విమర్శించింది. ఈ నేపథ్యంలో శరీరంలోని రక్తం గడ్డకట్టడంతో తన కుమార్తె కుప్పకూలి చనిపోయినట్లు తల్లి జానకి తెలిపింది.
 
అయితే విద్యార్థిని రియా తల్లి వ్యాఖ్యలను పోలీసులు ఖండించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వచ్చిన తర్వాతే ఆ బాలిక మరణానికి కారణం తెలియవస్తుందని చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైనర్ అమ్మాయి... అందరి ముందు తాళి కట్టేసిన అబ్బాయి...