Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముఖ్యమంత్రి పీఠాన్ని తిరస్కరించిన అంబికా సోని!

ముఖ్యమంత్రి పీఠాన్ని తిరస్కరించిన అంబికా సోని!
, ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (12:31 IST)
పంజాబ్ ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసినా కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత, గాంధీలకు విధేయురాలైన అంబికా సోని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. శనివారం అర్థరాత్రి ఆమెతో రాహుల్ గాంధీ సమావేశమైనట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో భాగంగా అంబికకు రాహుల్ సీఎం పదవిని ఆఫర్ చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 
 
అయితే, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సిక్కులే ఉండాలని, లేదంటే దాని వల్ల కలిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆమె చెప్పినట్టు సమాచారం. పంజాబ్ హోషియార్ పూర్ జిల్లాకు చెందిన అంబికా సోని.. పంజాబ్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. 1969లో ఇందిరాగాంధీ ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు.
 
కాగా, తనను అడుగడుగునా అవమానిస్తున్న కోపంతో ముఖ్యమంత్రిగా ఉన్న అమరీందర్ సింగ్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలందరితోనూ శనివారం సీఎల్పీ సమావేశం నిర్వహించారు. 
 
కాగా, పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధిపతులు సునీల్ జఖార్, ప్రతాప్ సింగ్ బాజ్వా, బియాంత్ సింగ్ మనవడు రవ్నీత్ సింగ్ బిట్టుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారితో పాటు పంజాబ్ పీసీసీ ప్రస్తుత చీఫ్ నవ్ జోత్ సింగ్ సిద్ధూ, సుఖ్జీందర్ సింగ్ రంధావా, త్రుప్త్ రాజీందర్ సింగ్ బాజ్వా, బ్రహ్మ్ మహీంద్ర, విజయ్ ఇందర్ సింగ్ల, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్జీత్ సింగ్ నగ్రాలూ రేసులో ఉన్నారని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విద్యార్థిని బుగ్గ కొరికి ప్రధానోపాధ్యాయుడు.. చితక బాదిన స్థానికులు