Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమర్నాథ్ యాత్రలో విషాదం : ఒక్కరోజే గుండెపోటుతో మృతి

Advertiesment
అమర్నాథ్ యాత్రలో విషాదం : ఒక్కరోజే గుండెపోటుతో మృతి
, బుధవారం, 12 జులై 2023 (17:09 IST)
పవిత్ర అమర్నాథ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. ఒక్క రోజే ఐదుగురు గుండెపోటుతో మరణించారు. గడిచిన 24 గంటల వ్యవధిలో ఐదుగురు యాత్రికులు మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. వీరి మృతికి గుండెపోటే కారణమని వారు తెలిపారు. దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో జరిగే ఈ యాత్రకు వెళ్లిన వారిలో ఈ ఏడాది మృతి చెందిన వారి సంఖ్య 19కి చేరినట్టు అధికారులు వెల్లడించారు.
 
తాజాగా మృతి చెందిన ఐదుగురిలో అనంతనాగ్‌ జిల్లాలోని పెహల్గాం మార్గంలో ముగ్గురు.. గాందర్‌బల్‌ జిల్లా బల్తాల్‌ మార్గంలో ఇద్దరు ఉన్నట్టు అధికారులు తెలిపారు. మృతుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు, మధ్యప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరు ఉండగా.. ఇంకో వ్యక్తి వివరాలను గుర్తించాల్సి ఉందని తెలిపారు.
 
ఇటీవల అమర్‌నాథ్‌ యాత్ర విధులకు వెళ్లిన ఓ ఐటీబీపీ అధికారి ప్రాణాలు కోల్పోగా.. తాజాగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ యాత్ర మొదలైనప్పట్నుంచి మొత్తం మృతుల సంఖ్య 19కి చేరింది. అమర్‌నాథ్ యాత్రికులు, విధులకు వెళ్లిన భద్రతా సిబ్బంది మరణానికి కారణం అక్కడి అసాధారణ పరిస్థితులే అని అధికారులు చెబుతున్నారు. 
 
అధిక ఎత్తులో ఆక్సిజన్‌ గాఢత తక్కువగా ఉండటం వల్ల గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. మంగళవారం వరకు అమర్‌నాథ్‌ క్షేత్రాన్ని 1,37,353 మంది యాత్రికులు సందర్శించారని అధికారులు వెల్లడించారు. దక్షిణ కాశ్మీర్‌లోని హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తున ఉన్న అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్ర వార్షిక యాత్ర జులై 1 నుంచి మొదలై ఆగస్టు 31 వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేడి వేడి బజ్జీల కోసం సైరన్ మోగించిన ఆంబులెన్స్ డ్రైవర్ (వీడియో వైరల్)