Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

220 వాట్ల విద్యుత్ తీగ రామ్ కుమార్ ప్రాణాల్ని తీస్తుందా? పోలీసులే చంపేశారా..?

స్వాతి హత్య కేసులో నిందితుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న రామ్ కుమార్.. పుళల్‌ జైలులో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం ప్రస్తుతం తమిళనాట హాట్ టాపిక్ అయ్యింది. రామ్ కుమార్ పోస్టు మార్టం రిపోర్ట్

Advertiesment
advocate argue that 220 volt power will kill ramkumar or not
, గురువారం, 22 సెప్టెంబరు 2016 (15:21 IST)
స్వాతి హత్య కేసులో నిందితుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న రామ్ కుమార్.. పుళల్‌ జైలులో ఆత్మహత్య చేసుకున్న సంగతి  తెలిసిందే. ఈ విషయం ప్రస్తుతం తమిళనాట హాట్ టాపిక్ అయ్యింది. రామ్ కుమార్ పోస్టు మార్టం రిపోర్ట్ కోసం అందరూ వేచి చూస్తున్న నేపథ్యంలో.. పోస్టు మార్టం కేసుపై చెన్నై హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఇక స్వాతి హత్య కేసుకు సంబంధించి జైలులో ఉన్న రామ్ కుమార్ మృత దేహం ప్రస్తుతం జీహెచ్‌లో ఉంది. 
 
ఆతడి మృతి పట్ల అనుమానాలున్నాయని.. పోస్టు మార్టమ్ చేసేటప్పుడు ప్రభుత్వ వైద్యులతో పాటు తమ తరపున ఓ ప్రైవేట్ వైద్యుడిని అనుమతింటాలని రామ్ కుమార్ తండ్రి చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ ప్రారంభమైంది.  
 
ఈ సందర్భంగా రామ్ కుమార్ తరపు న్యాయవాది శంకర సుబ్బు కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. ఇందులో భాగంగా రామ్ కుమార్ మృతిలో అనుమానాలున్నాయని.. అతడు హత్యకు గురైవుంటాడని తెలిపారు. రామ్ కుమార్ నోట కొరికినట్లు చెప్పబడుతున్న విద్యుత్ తీగ 220 వాట్ల మాత్రమే కలిగివుందని.. ఆ వాట్ల సామర్థ్యంలో రామ్ కుమార్ మృతి చెందే అవకాశం లేదన్నారు. పోలీసులే హింసించి రామ్ కుమార్‌ను చంపేశారని ఆరోపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్క్ జుకెర్‌బర్గ్ దాతృత్వం... రూ.3 బిలియన్ డాలర్ల విరాళం