Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తను చనిపోయినట్లు టీవీలో వస్తున్న వార్తను చూస్తున్న నటుడు ధర్మేంద్ర, ఇంతకన్నా దారుణం ఏముంటుంది?

Advertiesment
Dharmendra

ఐవీఆర్

, బుధవారం, 12 నవంబరు 2025 (12:22 IST)
వయసురీత్యా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ధర్మేంద్ర ఇటీవల ఆసుపత్రిలో చేరారు. ఆయన అలా చేరారో లేదో... కొద్ది గంటల్లోనే ఆయన చనిపోయారంటూ కొన్ని మీడియా ఛానళ్లు వార్తలు ప్రసారం చేసాయి. ఈ వార్తలను చూసిన ధర్మేంద్ర కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ధర్మేంద్ర బ్రతికి వుండగానే చనిపోయారంటూ వార్తలను ప్రచారం చేయడంపై ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తూ ధర్మేంద్ర తను ఆరోగ్యంగానే వున్నానంటూ ఓ వాయిస్ మెసేజ్ ఇప్పించారు. ఐనా వార్తల్లో ఎలాంటి మార్పు లేదు, తను చనిపోయినట్లు టీవీల్లో వస్తున్న వార్తను ధర్మేంద్ర స్వయంగా చూసి బాధపడ్డారు.
 
అనారోగ్యంతో ఇటీవల ఆస్పత్రిలో చేరిన ప్రముఖ బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర (89) బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు ఇంట్లోనే వైద్య సేవలు కొనసాగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. సెప్టెంబరు 31వ తేదీన ఆయనను ముంబై మహానగరంలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేర్చిన విషయంతెల్సిందే. శ్వాసపీల్చడంతో అసౌకర్యంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, బుధవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ధర్మేంద్రను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు ఆయనకు చికిత్స అందించిన డాక్టర్ ప్రతీత్ సందానీ వెల్లడించారు. కుటుంబ సభ్యుల వినతి మేరకు ధర్మేంద్రకు ఇంట్లోనే వైద్య సేవలు కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. 
 
కాగా, ధర్మేంద్ర మరణించారంటూ మంగళవారం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగిన విషయం తెల్సిందే. ఈ పుకార్లను ఆయన కుమార్తె ఈషా డియోల్ తీవ్రంగా ఖండించారు. కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయి. మా నాన్నగారు క్షేమంగా ఉన్నారు. కోలుకుంటున్నారు. దయచేసి మా కుటుంబానికి ప్రైవసీ ఇవ్వండి. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన వారికి ధన్యవాదాలు అని ఇన్‌స్టా వేదికగా విజ్ఞప్తి చేశారు. అలాగే, ధర్మేంద్ర మృతిపై తప్పుడు ప్రచారం జరగడంతో బాలీవుడ్ దిగ్గజ నటి హేమమాలిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డాక్టర్ షాహీన్ సిద్ధిఖీ: అద్భుతమైన బోధకురాలు ఉగ్రవాదిగా ఎలా మారిపోయింది?!