Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

11% మందికి ఏదో ఒక వ్యాధి, 35 ఏండ్లు దాటగానే సోకుతున్న వైనం

11% మందికి ఏదో ఒక వ్యాధి, 35 ఏండ్లు దాటగానే సోకుతున్న వైనం
, శుక్రవారం, 23 జులై 2021 (20:21 IST)
దేశంలో ప్రతి వెయ్యి మందిలో 116 మంది (11.6శాతం) ఏదో ఒక అసాంక్రమిక వ్యాధులతో బాధపడుతున్నారు. 35 ఏండ్లు పైబడిన తర్వాత ఈ వ్యాధుల బారిన పడుతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. అసాంక్రమిక వ్యాధుల బారిన పడుతున్నవారి సంఖ్య వేగంగా పెరగడానికి ప్రధాన కారణం గాలి కాలుష్యం.
 
అసోసియేటెడ్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఆఫ్‌ ఇండియా(అసోచామ్‌) తాజాగా విడుదల చేసిన ‘భారతదేశం-అసాంక్రమిక వ్యాధుల భారం’ నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. హైపర్‌టెన్షన్‌, జీర్ణకోశ వ్యాధులు, మధుమేహంతో ఎక్కువమంది బాధపడతున్నారు. ఈ వ్యాధులతో పోల్చితే క్యాన్సర్‌ బారిన పడుతున్నవారి సంఖ్య తక్కువగా ఉంది.
 
21 రాష్ట్రాల్లో 2,33,672 మందిపై సర్వే చేసి ఈ నివేదికను రూపొందించారు. అసాంక్రమిక వ్యాధుల బారిన పడుతున్న ప్రతి ముగ్గురిలో ఇద్దరు 26-59 ఏండ్ల లోపు వారే. వాయు కాలుష్యం, శారీరక శ్రమ లేకపోవడం, సమతులాహారం తీసుకోకపోవడం, జీవన శైలిలో మార్పులు అసాంక్రమిక వ్యాధుల వ్యాప్తిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని నివేదిక తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్లీన్‌ టు గ్రీన్‌ ఆన్‌ వీల్స్‌ కార్యక్రమాన్ని ఆవిష్కరించిన ఆర్‌ఎల్‌జీ