Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీ విమానాశ్రయంలో తుపాకీ కలకలం - స్వాధీనం

Advertiesment
Delhi Airport
, గురువారం, 3 ఫిబ్రవరి 2022 (09:27 IST)
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద తుపాకీని ఎయిర్ పోర్టు భద్రతా అధికారులు గుర్తించారు. ఆ వ్యక్తి దుబాయ్ దేశానికి చెందిన ప్రయాణిడుగా గుర్తించారు. దీంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. 
 
దుబాయ్ నుంచి ఢిల్లీకి వచ్చిన విమాన ప్రయాణికుల లగేజీలను కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఓ బ్యాగులో తుపాకీతో పాటు రెండు మ్యాగజైన్‌లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 
 
చెక్ ఇన్ బ్యాగులోకి పిస్టల్‌లు ఎలా తీసుకొచ్చాడన్న అంశంపై ప్రయాణికుడి వద్ద ఢిల్లీ పోలీసులు విచారణ చేస్తున్నారు. దుబాయ్ విమానాశ్రయంలో భద్రతా లోపం కారణంగానే ఇలా జరిగివుంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"ఛలో విజయవాడ" : ప్రభుత్వ ఉద్యోగులపై ఆంధ్రా పోలీస్ ఉక్కుపాదం...