Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇక చాలు.. రాజకీయాలకు రాం రాం: సోనియా గాంధీ ప్రకటన

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాజకీయాలకు స్వస్తి చెప్పనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తాను రిటైర్ అవుతున్నానని పార్లమెంట్ నుంచి బయటకు వెళ్తూ సోనియా గాంధీ మీడియాతో వెల్లడించారు.

Advertiesment
ఇక చాలు.. రాజకీయాలకు రాం రాం: సోనియా గాంధీ ప్రకటన
, శుక్రవారం, 15 డిశెంబరు 2017 (13:25 IST)
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాజకీయాలకు స్వస్తి చెప్పనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తాను రిటైర్ అవుతున్నానని పార్లమెంట్ నుంచి బయటకు వెళ్తూ సోనియా గాంధీ మీడియాతో వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా శనివారం రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించనున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ పగ్గాల నుంచి సోనియా గాంధీ తప్పుకోనుండటంతో పాటు రాజకీయాలకు దూరంగా వుంటూ విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించారు. 
 
శుక్రవారం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలకు హాజరైన సోనియా గాంధీ.. సభ వాయిదాకు అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకునే సమయం ఆసన్నమైందని.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. 
 
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించనున్న తరుణంలో పార్టీలో మీ పాత్ర ఎలా వుంటుందనే ప్రశ్నకు సోనియా గాంధీ.. తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోనున్నట్లు తెలిపారు.
 
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణానికి అనంతరం ఏడేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా వున్న ఇందిరమ్మ కుటుంబానికి.. సోనియా గాంధీ అన్నీ తానై నిలిచి.. రాజకీయాల్లోకి వచ్చారు. ఆపై 19 సంవత్సరాల పాటు కాంగ్రెస్ అధినేత్రిగా సోనియా బాధ్యతలు చేపట్టారు. తద్వారా ఎక్కువకాలం పార్టీ బాధ్యతలు నిర్వర్తించిన అధినేత్రిగా ఆమె రికార్డ్ సృష్టించారు.
 
సోనియా గాంధీ 1946 డిసెంబర్ 9న ఇటలీలో జన్మించారు. 1998 మార్చి 14న పార్టీ బాధ్యతలు స్వీకరించారు. 1991లో రాజీవ్ గాంధీ హత్య తర్వాత కాంగ్రెస్ నాయకులు ప్రధాని పదవి తీసుకోమని చెప్పగా నిరాకరించారు. ఆ తర్వాత ఐదేళ్లకు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1998లో పార్టీ చీఫ్ అయ్యారు. 2004లో లోకసభలో యూపీఏకు అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొడుకు పుట్టినరోజు నాడే భర్తను చంపేసిన స్వాతి...