Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎక్కువ జీతాలిచ్చే ఉద్యోగాలు వద్దే వద్దు.. మనశ్శాంతి వుంటే చాలు..?

Advertiesment
Indian Employees
, బుధవారం, 15 మార్చి 2023 (09:33 IST)
భారతీయ ఉద్యోగులపై ఇటీవల నిర్వహించిన సర్వేలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఎలాగంటే.. ఎక్కువ జీతాలు వద్దని భారతీయ ఉద్యోగులు అంటున్నారట. ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాల పట్ల భారతీయులు ఆసక్తి చూపట్లేదనే షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. 
 
మేనేజర్‌తో పాటు అధిక వేతనంతో కూడిన ఉద్యోగంలో చాలా ఒత్తిడి ఉంటుందని, ఇది మనశ్శాంతిని ప్రభావితం చేస్తుందని వారిలో చాలామంది అభిప్రాయపడ్డారు. అందువల్ల జీతం తక్కువగా ఉన్నా మనశ్శాంతితో కూడిన ఉద్యోగం కావాలని 88 శాతం మంది భారతీయులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 
 
అలాగే, 70% అమెరికన్లు మానసిక ప్రశాంతతతో కూడిన తక్కువ జీతంతో కూడిన ఉద్యోగం తమకు ముఖ్యమని చెప్పారు. ప్రపంచంలోని 10 దేశాల్లో నిర్వహించిన ఈ పోల్‌లో ఎక్కువ మంది ఎక్కువ జీతం కంటే మనశ్శాంతి, ప్రశాంతతను కోరుకుంటున్నారని వెల్లడైంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పెళ్లాడిన యువతి.. ఎక్కడ?