Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముత్తూట్ ఫైనాన్స్‌లో భారీ దోపిడి.. సీసీ కెమెరాలకే చిక్కలేదట..

ముత్తూట్ ఫైనాన్స్‌లో భారీ దోపిడి.. సీసీ కెమెరాలకే చిక్కలేదట..
, బుధవారం, 25 డిశెంబరు 2019 (18:10 IST)
కర్ణాటక ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్‌లో భారీ దోపిడీ చోటుచేసుకుంది. బెంగళూరు, పులకేశినగర్ సమీపంలోని బాణసవాడి - హెణ్ణూరు రోడ్‌‌లోని లింగరాజపురం బ్రిడ్జి సమీపంలో ఉన్న ముత్తూట్‌ ఫైనాన్స్‌ కార్యాలయంలోకి ప్రవేశించిన దొంగలు ఏకంగా 77 కిలోల బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని ముత్తూట్ శాఖలో గోడకు దొంగలు కన్నం వేశారు. 
 
ఆ కన్నం ద్వారా లోపలికి వెళ్లిన దొంగలు, పోలీసులకు ఆధారాలు చిక్కకుండా సీసీ కెమెరాలను తొలగించి, ఆపై నగలు దాచివుంచే బీరువాలను గ్యాస్ కట్టర్లతో కత్తిరించి, దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దొంగతనం జరిగిన తీరును గమనించి వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఈ భారీ దోపిడిలో సదరు సంస్థకు చెందిన శాఖలో పనిచేసేవారికి సంబంధం వుండవచ్చుననే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ ఏడాది అంబానీ సంపద ఎంతో తెలుసా?