Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీహార్‌లో బాంబు పేలుడు-ఏడుగురికి గాయాలు

బీహార్‌లో బాంబు పేలుడు-ఏడుగురికి గాయాలు
, సోమవారం, 28 మార్చి 2022 (18:43 IST)
బీహార్‌లో సోమవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. తక్కువ తీవ్రతో కూడిన పేలుడు కావడంతో పెను ప్రమాదం తప్పింది. బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆ జిల్లా ఎస్పీ సుశీల్ కుమార్ ధృవీకరించారు.
 
బాంబును ప్లాస్టిక్ సంచిలో ఉంచారు.. దానిని లుటన్ రజక్ అనే వ్యక్తికి చెందిన ఇంటి పెరట్లో పెట్టారు. ఆ కుటుంబానికి చెందిన మైనర్ బాలుడు ప్లాస్టిక్ బ్యాగ్ తెరిచిన వెంటనే పేలుడు సంభవించింది. 
 
బాంబు తీవ్రత తక్కువగా ఉంది. మొత్తం ఏడుగురికి గాయాలు అయ్యాయి. గాయపడినవారికి పిపారియా ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స అందించారని ఎస్పీ సుశీల్ కుమార్ తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న తర్వాత పోలీసులు అక్కడికి చేరుకున్నట్టుగా ఎస్పీ సుశీల్ కుమార్ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో భారీగా పెరగనున్న విద్యుత్ చార్జీలు