Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కన్వారియాలను ఢీకొన్న ట్రక్కు: ఐదుగురు మృతి

road accident
, శనివారం, 23 జులై 2022 (10:42 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హరిద్వార్ నుంచి శివభక్తులు గ్వాలియర్ వెళుతుండగా హత్రాస్ పట్టణం వద్ద శనివారం తెల్లవారుజామున 2.15 గంటలకు వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. 
 
హత్రాస్‌లో కన్వారియాలను ట్రక్కు కొట్టడంతో ఐదుగురు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. గాయపడిన శివభక్తుడిని పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 
 
గ్వాలియర్ నుంచి శివ భక్తులు హరిద్వార్ నుంచి తిరిగి వస్తుండగా శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, ట్రక్ డ్రైవర్ గురించి తమకు సమాచారం అందిందని రాజీవ్ కృష్ణ చెప్పారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని కృష్ణ హామీ ఇచ్చారు.
 
శ్రావణంలో గంగా నది నీటిని తీసుకొచ్చి దేవుడికి సమర్పించేందుకు శివుని భక్తులు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, రిషికేశ్, గౌముఖ్, ఇతర ప్రదేశాలకు కాలినడకన కన్వార్ యాత్ర సాగిస్తారు. ఈ వారం ప్రారంభంలో హరిద్వార్‌లో స్నానం చేస్తున్నప్పుడు గంగా నది ప్రవాహానికి ఏడుగురు కన్వారియాలు కొట్టుకుపోయారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెడ్ అలెర్ట్.. మళ్ళీ పెరిగిన గోదావరి..