Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జైపూర్ హైవేలో రోడ్డు ప్రమాదం.. గంగానదిలో అస్థికలను కలిపి తిరిగి వస్తుండగా..?

Accident
, మంగళవారం, 17 మే 2022 (16:15 IST)
Accident
ఢిల్లీ-జైపూర్ హైవేలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, ఏడుగురు గాయాలపాలైనారు. ఢిల్లీ-జైపూర్ హైవేపై వేగంగా వెళ్తున్న క్రూయిజర్ ఆగి వున్న ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. 
 
మరణించిన వారు ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు వున్నారు. హరిద్వార్ నుండి జైపూర్‌కు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది.
 
తండ్రి అస్థికలను హరిద్వార్ వద్ద గంగానదిలో నిమజ్జనం చేసిన తరువాత రామ్ తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని రేవారీ పోలీసులు చెప్పారు. 
 
మృతులను సమౌడ్ గ్రామానికి చెందిన మల్లు రామ్, మహేందర్ కుమార్, సుగ్నా, ఆశిష్, భోరి దేవిగా గుర్తించారు. క్షతగాత్రులను రేవారి జిల్లాలోని బావల్ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చేర్చినట్లు పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రధానికి రక్తంతో లెటర్.. అన్యాయం జరిగితే నక్సల్స్‌లో చేరుతాం