Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డివైడర్‌ను ఢీకొట్టి కంటైనర్‌ కిందకు దూసుకెళ్లిన కారు.. ఐదుగురు దుర్మరణం

డివైడర్‌ను ఢీకొట్టి కంటైనర్‌ కిందకు దూసుకెళ్లిన కారు.. ఐదుగురు దుర్మరణం
, ఆదివారం, 30 జనవరి 2022 (16:31 IST)
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూణె - ముంబై ఎక్స్‌ప్రెస్ రహదారిపై ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. లోనావ్లా, శిలాతనే అనే గ్రామంలో ఉదయం 8 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. కారు ఒకటి కంటైనర్ లారీ కిందకు దూసుకెళ్లింది. 
 
పూణె నుంచి ముంబైకి వెళుతుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కారు రోడ్డు అవతలి భాగంలోకి వెళ్లింది. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీ కిందకు కారు దూసుకెళ్లింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా హర్యానా రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. సమచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వల్పంగా మెరుగుపడిన లతా మంగేష్కర్ ఆరోగ్యం