Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

250 రైళ్లు వృథా: మంత్రి పీయూష్‌గోయల్‌

Advertiesment
250 రైళ్లు వృథా: మంత్రి పీయూష్‌గోయల్‌
, సోమవారం, 1 జూన్ 2020 (12:11 IST)
ఇంటికెళ్లే మార్గం లేక వలస కార్మికులు అల్లాడిపోతుంటే.. వారిని పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలు ఉత్తుత్తి మాటలతో సరిపెడుతున్నాయని తేలిపోయింది. కేంద్రం కనికరించినా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయంలో చేతులెత్తేశాయి.

వలసకార్మికుల కోసం రైళ్లను కేటాయించాలని కోరిన రాష్ట్రాలు కార్మికులను తరలించకపోవడంతో.. 250 రైళ్లు వృథా అయ్యాయని రైల్వే శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ వ్యాఖ్యానించారు.

అయితే రాష్ట్రాలు కోరితే మరిన్ని ప్రత్యేక రైళ్లను కేటాయిస్తామని అన్నారు. అయినప్పటికీ తాము ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదని అన్నారు.

మీడియాకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. బాధాకరమైన విషయం ఏమిటంటే, 250 రైళ్లను కేటాయిస్తే.. మహారాష్ట్ర కేవలం వంద రైళ్లను మాత్రమే వలసకార్మికుల కోసం వినియోగించిందని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో ఆల‌యాల‌కు గ్రామ, వార్డు సచివాలయాలలోనే అడ్వాన్స్ బుకింగ్‌