Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం.. 25 మంది స్కూలు విద్యార్థుల దుర్మరణం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహా విషాదం నెలకొంది. రాష్ట్రంలోని ఎటా జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ జిల్లాలోని అలిగంజ్‌లో స్కూల్ పిల్లలతో వెళుతున్న ఓ బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు తిరగబడింది. 25 మంది చిన్నారులు ఘటనా స్థలి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం.. 25 మంది స్కూలు విద్యార్థుల దుర్మరణం
, గురువారం, 19 జనవరి 2017 (14:51 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహా విషాదం నెలకొంది. రాష్ట్రంలోని ఎటా జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ జిల్లాలోని అలిగంజ్‌లో స్కూల్ పిల్లలతో వెళుతున్న ఓ బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు తిరగబడింది. 25 మంది చిన్నారులు ఘటనా స్థలిలోనే ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదంలో మరో 50 మంది వరకు గాయపడ్డారు. 
 
ఈ చిన్నారులంతా ఎటాలో ఉన్న జేఎస్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన విద్యార్థులుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారుల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఇది అత్యంత బాధాకర విషయమని, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు ప్రధాని కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. 
 
ఈ ఘటనపై కేసు న‌మోదు చేసుకున్న‌ పోలీసులు మీడియాతో మాట్లాడుతూ...  ద‌ట్ట‌మైన పొగ‌మంచు కార‌ణంగానే ప్ర‌మాదం జ‌రిగిందని తెలిపారు. పొగ‌మంచు కార‌ణంగా పాఠ‌శాల‌లు మూసేయాల‌ని స‌ర్కారు ఆదేశాలు జారీ చేసిన‌ప్ప‌టికి స‌ద‌రు స్కూలు ఆదేశాల‌ను ప‌ట్టించుకోలేద‌ని అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోదండరామ్ కొత్త పార్టీ పెడతారా? యోగేంద్ర యాదవ్ కామెంట్స్‌కు అర్థం ఏమిటి..? కేసీఆర్‌కు కష్టాలు తప్పవా?