Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో24 నకిలీ యూనివర్సిటీలు: రాష్ట్రంలో ఒకటి.. యూపీలోనే అధికం

Advertiesment
Universities
, మంగళవారం, 3 ఆగస్టు 2021 (13:45 IST)
నకిలీ విశ్వవిద్యాలయాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఈ నకిలీ విశ్వవిద్యాలయాలకు సంబంధించి తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశ వ్యాప్తంగా యూనియన్ గ్రాంట్ కమిషన్ 24 ఫేక్ యూనివర్సిటీలను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోనే ఉన్నాయని తెలిపారు.
 
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో దేశంలో నకిలీ విశ్వవిద్యాలయాలకు సంబంధించి లోక్‌ సభలో పలువురు ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నలకు సమాధానంగా కేంద్రం కీలక ప్రకటన చేసింది. లోక్‌సభ సభ్యులు అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 8 ఫేక్ యూనివర్సిటీలను యూజీసీ గుర్తించినట్లు వెల్లడించారు. 
 
ఇక ఢిల్లీలో 7, ఒడిశాలో 2, పశ్చిమ బెంగాల్‌లో 2, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి‌లో ఒక్కో నకిలీ యూనివర్సిటీలను గుర్తించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సాధారణ ప్రజలు, మీడియా ఫిర్యాదుల ద్వారా ఫేక్ యూనివర్సిటీలను గుర్తించినట్లు లోక్‌సభలో కేంద్రం తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

6వ సారి పెళ్లి చేసుకోబోయిన మాజీ మంత్రి అరెస్టు, మూడో భార్య నగ్మ ఫిర్యాదుతో...