Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కర్ణాటక.. 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారా?

Karnataka Election results
, శుక్రవారం, 26 మే 2023 (09:26 IST)
కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేశారు. ఇక శనివారం సిద్ధరామయ్య మంత్రివర్గ విస్తరణ జరగనుంది. 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నెల 20న సిద్ధూ, డీకేతో పాటు మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. 
 
వీరిలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే కూడా ఉన్నారు. అయితే మంత్రులకు శాఖలను కేటాయించలేదు. ఈ నేపథ్యంలో శనివారం మంత్రివర్గ విస్తరణ పూర్తి అయిన తర్వాత శాఖలను కేటాయించే అవకాశం వుంది. 
 
ఇప్పటికే సిద్ధూ, డీకే ఇద్దరూ ఢిల్లీలో ఉన్నారు. మంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వాలనే విషయంపై హైకమాండ్‌తో చర్చించి తుది జాబితాను విడుదల చేయనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నారా లోకేష్ పాదయాత్రకు బ్రేక్.. కారణం ఏంటో తెలుసా?