Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జమ్ముకాశ్మీర్‌లో పెచ్చరిల్లిన ఉగ్రవాదులు.. ఇద్దరు టీచర్ల హతం

జమ్ముకాశ్మీర్‌లో పెచ్చరిల్లిన ఉగ్రవాదులు.. ఇద్దరు టీచర్ల హతం
, గురువారం, 7 అక్టోబరు 2021 (13:53 IST)
జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదులు పెచ్చరిల్లిపోతున్నాయి. శ్రీనగర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపాల్‌తో పాటు ఓ టీచర్‌ను హతమార్చారు. అలాగే గురువారం ఈద్గాం సంగం పాఠశాలపై ఉగ్రవాదులు చేశారు. ఇద్దరు ఉపాధ్యాయులపై పాయింట్ బ్లాక్‌లో కాల్పులు జరిపారు. 
 
దీంతో వారిద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన టీచర్లను సిక్కు, కాశ్మీరీ పండిట్ వర్గానికి చెందిన సతీందర్ కౌర్‌, దీపక్ చాంద్‌గా పోలీసులు గుర్తించారు. వెంటనే ఘటన జరిగిన ప్రాంతాన్ని మూసివేసి.. ఉగ్రవాదుల కోసం అన్వేషణ మొదలుపెట్టినట్లు వెల్లడించారు పోలీసులు.
 
నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తాజా హత్యలను ఖండించారు. మంగళవారం కూడా ఉగ్రవాదులు ఓ కశ్మీరీ పండిట్‌ను హతమార్చిన విషయం తెలిసిందే. శ్రీనగర్‌లోని ఇక్బాల్ పార్క్‌లో ఉన్న ఓ ఫార్మసీ షాపు ఓనర్ 70 ఏళ్ల మఖన్ లాల్ బింద్రూను ఉగ్రవాదులు కాల్చి చంపారు. 
 
రాత్రి ఏడు గంటల సమయంలో పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో అతన్ని కాల్చారు. 1990 దశకంలో కశ్మీరీ పండిట్ బింద్రూ ఉగ్రవాదం హెచ్చు స్థాయిలో ఉన్న సమయంలోనూ ఫార్మసీ నడిపారు. కాగా.. గత ఐదు రోజుల్లో కశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఏడుగురు పౌరులు మరణించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ మార్కెట్‌లోకి రానున్న వన్‌ప్లస్ 9ఆర్‌టీ