Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చత్తీస్‌గఢ్ పోలీసుల దాష్టీకం .. 16 మంది యువతులపై అత్యాచారం... సర్కారుకు నోటీసులు

యువతుల మానప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే యువతులను చెరబట్టారు. ఫలితంగా 16 మంది యువతులపై అత్యాచారం జరిపారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 16 మంది యువతులపై అత్యాచారానికి ఒడిగట

చత్తీస్‌గఢ్ పోలీసుల దాష్టీకం .. 16 మంది యువతులపై అత్యాచారం... సర్కారుకు నోటీసులు
, ఆదివారం, 8 జనవరి 2017 (10:19 IST)
యువతుల మానప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే యువతులను చెరబట్టారు. ఫలితంగా 16 మంది యువతులపై అత్యాచారం జరిపారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 16 మంది యువతులపై అత్యాచారానికి ఒడిగట్టారని, వారిని దారుణంగా హింసించారని, అందుకు ప్రభుత్వానిదే బాధ్యతంటూ, జాతీయ మానవ హక్కుల కమిషన్ తాజాగా నోటీసులు జారీ చేసింది. అత్యాచారానికి గురైన 8 మందికి రూ. 3 లక్షలు, లైంగిక వేధింపులకు గురైన ఆరుగురికి రూ. 2 లక్షలు, భౌతిక దాడికి గురై బాధపడ్డ ఇద్దరికి రూ. 50 వేల చొప్పున పరిహారాన్ని ఇవ్వాలని సూచించింది. 
 
అయితే, ఈ ఘటనలు 2015, 2016లో నమోదయ్యాయని, పోలీసులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. తాము 20 మంది బాధితుల స్టేట్మెంట్లను రికార్డు చేయనున్నట్టు పేర్కొంది. కాగా, నవంబర్ 2015లో దాదాపు 40 మంది పోలీసులు బీజాపూర్ జిల్లాలో ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన వార్త అప్పట్లో సంచలనం కలిగించింది. దీనిపై మీడియాలో వార్తలు వచ్చిన తరువాత ఎన్‌హెచ్ఆర్‌సీ స్పందించి స్వతంత్ర విచారణ జరిపించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శరీరం పెంచడం కాదు.. సమస్యను అర్థం చేసుకోవాలి.. చంద్రబాబుపై పవన్ ట్వీట్!!!