Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమికులకు సహకరించాడని.. 13ఏళ్ల బాలుడిని శూలాలకు గుచ్చి చంపేశారు..

ప్రేమికులకు సహకరించాడన్న పాపానికి 13ఏళ్ల బాలుడిని ఆలయంలోని శూలాలకు గుచ్చి అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన తమిళనాడులోని తంజావూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తంజావూరు జిల్లాలోని వీరమంజేరి

ప్రేమికులకు సహకరించాడని.. 13ఏళ్ల బాలుడిని శూలాలకు గుచ్చి చంపేశారు..
, గురువారం, 19 జనవరి 2017 (11:12 IST)
ప్రేమికులకు సహకరించాడన్న పాపానికి 13ఏళ్ల బాలుడిని ఆలయంలోని శూలాలకు గుచ్చి అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన తమిళనాడులోని తంజావూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తంజావూరు జిల్లాలోని వీరమంజేరికి చెందిన అరుణ్‌కుమార్‌ (13) 8వ తరగతి చదువుతున్నాడు. అతని ఇంటిపక్కనే ఉన్న బంధువు కలైసెల్వి (18).. అదే గ్రామానికి చెందిన అరుళ్‌ (23)తో ప్రేమలో పడింది. వారిద్దరికీ అరుణ్‌ ‘మాట సాయం’ చేస్తున్నట్లు కలైసెల్వి బంధువులకు అనుమానం వచ్చింది. 
 
ఈ విషయం తెలియరావడంతో మంగళవారం సాయంత్రం నుంచి అరుణ్‌కుమార్‌ కనిపించకుండాపోయాడని అతడి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. వీరమంజేరి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న మణి ఆండవర్‌ ఆలయ త్రిశూలాలకు అరుణ్‌కుమార్‌ శవం వేలాడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు జరిపిన దర్యాప్తులో అతన్ని తానే చంపేశానని కలైసెల్వి సోదరుడు కదివరన్‌ అంగీకరించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యువతులను వేధిస్తున్న పోకిరీకి తగిన శాస్తి.. బట్టలూడదీసి.. మెడలో చెప్పులు వేసి..?