Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాంగ్రెస్ పార్టీని చీల్చేందుకు మోడీ సర్కారు కుట్ర : మల్లికార్జున ఖర్గే

Advertiesment
mallikarjuna kharge

ఠాగూర్

, బుధవారం, 11 జూన్ 2025 (19:47 IST)
కాంగ్రెస్ పార్టీని చీల్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కర్నాటకలోని కల్బురిగి జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోడీ సర్కారుపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీని విడగొట్టేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని, ఇందుకోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రధాని 11 మంది పాలనలో దేశ యువతకు తప్పుదోవ పట్టించారని, అనేక తప్పులు చేశారని దయ్యబట్టారు. 
 
వాల్మికి కార్పొరేషన్ కుంభకోణం ఆరోపణలకు సంబంధించి ముగ్గురు కాంగ్రెస్ ఎంపీల ఇళ్ళపై ఈడీ దాడులు కుట్రపూరితంగా చేస్తున్నారు. "కాంగ్రెస్ పార్టీ బలహీనపరిచేందుకే మోడీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. మా ఎంపీలపై ఆరోపణలు మోపి, దాడులు చేయిస్తున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చీలిక రాదు, మేమంతా ఐక్యంగా ఉన్నాం" అన్నారు. 
 
"మోడీ 11 పాలనలో ఎన్నో తప్పులు జరిగాయి. లెక్కలేనన్ని అబద్దాలు చెప్పి దేశ యువతను మోసం చేశారు. ఈ సుధీర్ఘకాలంలో ఆయన ప్రభుత్వం ఏకంగా 33 తప్పులు చేసింది. నా రాజకీయ జీవితంలో ఇలా అబద్దాలు చెప్పి, యువతను, పేదలను మోసగించి ఓట్లు దండుకునే ప్రధానమంత్రిని ఎపుడూ చూడలేదు. ఇపుడు మోడీ రూపంలో చూస్తున్నాను. ఆయనకు ప్రజల బాగోగుల గురించి ఏమాత్రం పట్టదు" అని ఆరోపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెనాలిక్స్ స్వదేశీ ఏఐ ఆధారిత స్మార్ట్ హెమోడయాలసిస్ మెషీన్‌ విడుదల