Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆగ్రాలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. ట్యూషన్‌కు అంటూ వెళ్లి..?

victim girl

సెల్వి

, మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (21:57 IST)
ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం జరిగింది. ఆరేళ్ళ ఏళ్ల బాలికపై 11 ఏళ్ల బాలుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. సదరు బాలికను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లిన బాలుడు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
 
అయితే బాలిక రక్తపు గాయంతో ఇంటికి రావడంతో తండ్రి విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. 
 
ఆసుపత్రిలో పోలీసులు బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేయలేకపోయారు. బాలిక తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన ఫిర్యాదు ప్రకారం.. బాధితుకాలు శనివారం సాయంత్రం ట్యూషన్ క్లాసుల కోసం వెళ్లిన సమయంలో బాలుడు తనతో పాటు నిర్మానుష్య ప్రదేశానికి రమ్మని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడని తెలియవచ్చింది. 
 
నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. బాలుడిపై లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ (పోక్సో) చట్టంతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత జువైనల్ హోమ్‌కు పంపుతామని డీసీపీ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రచారం కోసం యువతి బుగ్గపై ముద్దుపెట్టిన బీజేపీ అభ్యర్థి.. ఎక్కడ?