Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ బిడ్డను నేనేం చేయాలి : తల్లి అయిన పదేళ్ళ బాలిక ప్రశ్న

పదేళ్ళ బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం స్పృహలోకి వచ్చిన ఆ బాలిక పక్కలో బిడ్డను పడుకోబెడితే.. ఈ బిడ్డను నేనేం చేయాలి అంటూ ప్రశ్నించడంతో వైద్య సిబ్బంది విస్తుపోయారు. ఈ వివరాలను పరిశీలిస్తే.

ఈ బిడ్డను నేనేం చేయాలి : తల్లి అయిన పదేళ్ళ బాలిక ప్రశ్న
, శుక్రవారం, 18 ఆగస్టు 2017 (11:55 IST)
పదేళ్ళ బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం స్పృహలోకి వచ్చిన ఆ బాలిక పక్కలో బిడ్డను పడుకోబెడితే.. ఈ బిడ్డను నేనేం చేయాలి అంటూ ప్రశ్నించడంతో వైద్య సిబ్బంది విస్తుపోయారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
చండీగఢ్ రాష్ట్రంలో సమీప బంధువుల చేతిలో ఓ బాలిక పలుమార్లు అత్యాచారానికి గురైంది. ఫలితంగా ఆ బాలిక గర్భందాల్చింది. అయితే, కడుపులో రాళ్లు ఉన్నాయనీ, ఆపరేషన్‌ చేయాలని చెప్పి ఆమెను తల్లిదండ్రులు వైద్యశాలకు తీసుకునిరాగా, ఆ బాలిక గర్భందాల్చివుందనే విషయం వైద్యులు చెప్పేంతవరకు బాలిక తల్లిదండ్రులకు తెలియదు. 
 
అదేసమయంలో బాలికకు గర్భస్రావం చేసేందుకు కోర్టును ఆశ్రయించగా, అందుకు సుప్రీంకోర్టు నిరాకరిండంతో చండీగఢ్‌లోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలోని ఐసీయూలో వైద్యుల బృందం గురువారం ఆమెకు ఆపరేషన్‌ నిర్వహించి కాన్పు చేశారు.
 
ముగ్గురు గైనకాలజిస్టులు, నియోనటాలజిస్ట్‌, పిడియాట్రిషియన్‌ వైద్య బృందంలో ఉన్నారని బాలిక ఆరోగ్య పర్యవేక్షణ కోసం నియమించిన కమిటీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ దాసరి హరీశ్‌ తెలిపారు. ఇది అసాధారణ గర్భమైనా సిజేరియన్‌ సజావుగా సాగిందనీ, శిశువు బరువు (2.2 కేజీలు) కొంచెం తక్కువగా ఉండటంతో ఐసీయూలో ఉంచామని వెల్లడించారు. బాలిక ఆరోగ్యం స్థిరంగానే ఉందన్నారు. అయితే, కన్నబిడ్డను చూసిన ఆ బాలిక... ఏం చేయోలో తెలియని అయోమయ స్థితిలో ఉండటం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా వయసు 107 యేళ్లు.. నా విజయ రహస్యమిదే...