Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీతాన‌గ‌రంలో జీయ‌ర్ స్వామి పుష్క‌ర యజ్ఞం

గుంటూరు : శ్రావణ శుక్రవారం కృష్ణా పుష్క‌రాల‌కు భ‌క్త జ‌నం పోటెత్తారు. విజ‌య‌వాడ‌లో ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు హాజ‌ర‌వుతున్నారు. ఉద‌యం ప‌ది గంటలకు 80, 500 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మ‌రో ప‌క్క సీతాన‌గ‌రంలో త్రిదండి చిన జీయ‌ర్ స్వామి

Advertiesment
chinnjeeyar swamy holybath in krishnapushkaralu 2016
గుంటూరు : శ్రావణ శుక్రవారం కృష్ణా పుష్క‌రాల‌కు భ‌క్త జ‌నం పోటెత్తారు. విజ‌య‌వాడ‌లో ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు హాజ‌ర‌వుతున్నారు. ఉద‌యం ప‌ది గంటలకు 80, 500 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మ‌రో ప‌క్క సీతాన‌గ‌రంలో త్రిదండి చిన జీయ‌ర్ స్వామి ఆధ్వ‌ర్యంలో పుష్క‌ర య‌జ్ఞం నిర్వ‌హించారు.
 
ఈ కార్య‌క్ర‌మానికి ప‌లువురు స్వామీజీల‌తో పాటు ఏపీ దేవాదాయ‌శాఖ మంత్రి మాణిక్యాలరావు హాజ‌ర‌య్యారు. చినజీయర్ స్వామితో పుష్కర ఘాట్లో స్వాములు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పుష్క‌రాల 12 రోజులు సీతాన‌గ‌రంలో య‌జ్ఞయాగాదులు నిర్వ‌హిస్తున్న చిన‌జీయ‌ర్ స్వామి నిత్యం కృష్ణ‌కు పుష్క‌ర హార‌తి స‌మ‌ర్పిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీతమ్మ భూదేవి ఒడిలోకి చేరిపోతే.. రామలక్ష్మణులు ఎలా తనువు చాలించారో తెలుసా?