మిరపగింజచూడ మీద నల్లగనుండు
కొరికిచూడు లోనచురుకు మనును
సజ్జను లగునారి సారమిట్లుండురా
విశ్వదాభిరామ వినురవేమ...!
తాత్పర్యం :
మిరియపుగింజ మీద నల్లగా ఉన్నప్పటికీ... దానిని కొరికిన వెంటనే చురుక్కుమంటుంది. మంచి వారు పైకి ఏవిధంగా కనిపించినప్పటికీ వారిని జాగ్రత్తగా గమనించినచో అసలు విషయం బయటపడుతుందని ఈ పద్యం యొక్క భావం.