పాలను గలసిన జలమును
బాలవిధంబుననె యుండు బరికింపంగా,
బాలచవి జెరుచు, గావున
తాలసుడగువానిపొందు వలదుర సుమతీ...!
తాత్పర్యం :
పాలల్లో కలిసిన నీరు పాలులాగానే కనిపిస్తుంది. కానీ పరిశీలించి చూస్తే... పాలు నీరు కలవడంతో తమ సహజమైన రుచిని పోగొట్టుకుంటాయి. ఇదే విధంగా చెడ్డవారితో మంచివారు స్నేహం చేసినట్లైతే, మంచి గుణాలను పోగొట్టుకుంటారు. కాబట్టి, చెడ్డవారితో స్నేహం చేయరాదని ఈ పద్యం యొక్క భావం.