పదుగురాడు మాట పాటియై ధర జెల్లు
ఒక్కడాడు మాట ఎక్కదెందు
ఊరకుండువాని నూరెల్ల నోపదు
విశ్వదాభిరామ.. వినుర వేమ...!
తాత్పర్యం :
ఎక్కువమంది మాట్లాడే మాటకే విలువ ఉంటుంది. ఒక్కడు చెప్పే మాట ఎప్పటికీ చెల్లదు. అటూ, ఇటూ కాని తటస్థుడిని ఎవరూ పట్టించుకోరని ఈ పద్యం యొక్క భావం. కాబట్టి, ఎప్పుడూ ఒంటరిగా, తటస్థుడుగా ఉండవద్దని వేమన ఈ పద్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు.