Publish Date: Sat, 09 Aug 2008 (15:48 IST)
Updated Date: Sat, 09 Aug 2008 (15:44 IST)
బొంది యెవరి సొమ్ము పోషింప బలుమారు
ప్రాణ మెవరి సొమ్ము భక్తి సేయ,
ధనమదెవరి సొమ్ము ధర్మమె తన సొమ్ము
విశ్వదాభిరామ వినుర వేమ...!
తాత్పర్యం :
ఎంతటి బలమైన ఆహారం పెట్టి పోషించినా ఈ శరీరం శాశ్వతం కాదు. ఎవరి ప్రాణాలు శాశ్వతం కాదు. డబ్బుకూడా నిలవదు. ఎప్పటికైనా మనం చేసిన దాన ధర్మాలే కలకాలం నిలచి ఉంటాయి. అందుకే అందరూ ధర్మబుద్ధిని కలిగి ఉండాలని చెబుతున్నాడు వేమన.