Publish Date: Tue, 12 Aug 2008 (12:01 IST)
Updated Date: Tue, 12 Aug 2008 (12:01 IST)
పాల నీటి కలత పరమహంస మెఱుగును
నీరు పాలు నెట్లు నేర్చునెమలి
లజ్ఞుడైన హీనుడల శివ నెఱుగునా?
విశ్వదాభి రామ వినుర వేమా...!
తాత్పర్యం :
నీటిలో కలిసి ఉన్న పాలను వేరు చేయడం హంసకు తెలుస్తుంది. కానీ ఆ నేర్పరితనం నెమలికి లేదు. అలాగే జ్ఞాని, ఉత్తముడు మాత్రమే పరమేశ్వరుడి పరమతత్వాన్ని తెలుసుకోగలుగుతారు. అంతేగానీ మూర్ఖుడు ఆ తత్వాన్ని అర్థం చేసుకోలేడని ఈ పద్యంలో చెబుతున్నాడు వేమన.